పట్టణంలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో తృతీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చ కస్వాములు శ్రీవెంకటేశ్వరస్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీత్రి దండి శ్రీమన్నారాయణ రా మానుజ చినజీయర్ స్వామి మంగళశాసనాలతో శ్రీ అహో బిల జీయర్స్వామి గరుడ ప టానికి పూజలు నిర్వహించి, ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. జీయర్ ఆశ్రమనిర్వాహకులు వెంకటాచార్యులు ఆధ్వర్యంలో వేద విద్యార్థు లు అగ్ని ప్రతిష్ఠ యాగం, పూర్ణాహుతి కార్యక్రమాలు చేశారు. అనంతరం జరిగిన స్వామి వారి అశ్వవాహన ఊరేగింపు సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారికి దేవతాహ్వానం, శేషవాహన సేవాకార్యక్రమాలు విశేషంగా జరిగాయి. శ్రీఅహోబిల జీయర్స్వామి భక్తులకు అనుగ్రహభాషణం చేసి, తీర్థగోష్ఠి నిర్వహించారు. వేదపాఠశాల ప్రాంగణంలో భక్తులకు అన్న ప్రసాదాలు అందించారు.ఈ కార్య క్రమంలో వెంకటాచార్యులు, అర్చ కులు మధుసూదనాచార్యులు, శ్రీనివాసాచార్యులు, రఘునాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
విజయకీలాద్రిపై బ్రహ్మోత్సవాలు ప్రారంభం